బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేశారు.ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు 2025 ఎన్నికల వరకు ఆగాల్సిన పని లేదని చెప్పారని తెలుస్తోంది.
జన్ సురాజ్ పాదయాత్రలో భాగంగా షియోమర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.తేజస్వీ యాదవ్ ను ఇప్పుడే సీఎంగా చేస్తే మూడు సంవత్సరాలు ఆయన పదవిలో ఉంటారని చెప్పారు.
ఆయన పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ప్రజలకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహాకూటమికి నితీశ్ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.







