సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలలో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది.ఈ అధిక బరువు సమస్యను దూరం చేసుకోవడానికి కొంతమంది ప్రజలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
బరువు పెరగడం ఈజీ గానే ఉంటుంది.కానీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇంకా చెప్పాలంటే చాలా మంది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.
ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అధిక బరువు తగ్గడానికి కరివేపాకు జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కరివేపాకు జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకును కడిగి నీళ్లలో ఉడికించాలి.కాసేపు తర్వాత ఆ నీళ్లను వాడకట్టి గోరువెచ్చగా తీసుకోవాలి.రుచి కోసం నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవడం మంచిది.దీనిని పరిగడుపున మాత్రమే తీసుకోవాలి.ఈ జ్యూస్ శరీరంలోని కొవ్వు ను కరిగించడానికి కీలకపాత్ర పోషిస్తుంది.పొట్ట, నడుము చుట్టూ ఉన్న అధిక కొవ్వు కరగాలంటే కరివేపాకు జ్యూస్ త్రాగడం మంచిది.
దీనిలో ఉండే ఆల్క లాయిడ్ల సాయంతో లిపిడ్ ఫ్యాట్ కరిగిపోతుంది.కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల గ్లిజరైడ్స్ ను తగ్గించుకోవచ్చు.దీని తో పాటు బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.కరివేపాకుతో అధిక బరువును దూరం చేసుకోవచ్చు.కరివేపాకు మంచి సువాసన కలిగిన పదార్థం.దక్షిణాదిన చాలా వంటలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇవే కాకుండా శరీరంలోని చాలా రకాల ఆరోగ్య సమస్యలను కరివేపాకు దూరం చేస్తుంది.