మిస్ ఇండియా ఒకప్పుడు నటించిన యాడ్ ఏదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కర్ణాటక కు చెందిన సినీ శెట్టి తాజాగా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటాన్ని సొంతం చేసుకుంది.దేశంలో ఉన్న అందగత్తెలను వెనక్కి నెట్టి మరి మిస్ ఇండియా కిరీటాన్నీ కైవసం చేసుకుంది సినీ శెట్టి.

21 ఏళ్ల కర్ణాటక కన్నడ సోయగం తాజాగా ఆదివారం రోజున జరిగిన 58వ ఫెమినా అందాల పోటీల్లో మిస్ ఇండియా 2022 విజేతగా నిలిచింది.ఆ అందాల పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులో పోటీ పడగా అందులో చివరిగా కర్ణాటక కు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ ను గెల్చుకుంది.2001లో ముంబైలో జన్మించిన ఆమె ఫ్యాషన్ పై ఉన్న ఆసక్తితో ప్రపంచంలో మోడల్ గా తెరపైకి వచ్చింది.చిన్నప్పటి నుంచి ఆమెకు డాన్స్ ఇష్టం ఉండటంతో డాన్స్ లో కూడా ఆరి తేరింది.

అయితే సినీ శెట్టి కేవలం ఇంస్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉండటం అందరికి షాక్ కు గురిచేస్తుంది.అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించదు.సినీ శెట్టి ప్రకృతి ప్రేమికురాలు కావడంతో తన తొలి పోస్ట్ సైతం ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగానే ఉంది.

సినీ శెట్టి అకౌంటింగ్ ఫైనాన్స్ లో గ్రాడ్యూయేషన్ చేశారు.సినీ శెట్టి ప్రస్తుతం సీఎఫ్ఏ చేస్తున్నారు.ప్రముఖ నెట్ వర్కింగ్ కంపెనీ ఎయిర్ టెల్ కోసం గతంలో రూపొందించిన యాడ్ లో సినీ శెట్టి కెమెరా ముందుకు వచ్చింది.

Advertisement

కెమెరా ముందు తన ప్రయాణం ఎంతో సరదాగా సాగిందని ఆమె తెలిపారు.ఇక సినీ శెట్టి భరతనాట్యం డ్యాన్సర్ కూడా.ఎంతో మంది కొరియాగ్రాఫర్స్ తోనూ పనిచేసింది.

కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలని సినీ శెట్టి స్వయం కృషితో ఈ స్తాయికి చేరడానికి కృషి చేసింది.

Advertisement

తాజా వార్తలు