దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిరుపేద కుటుంబాలకు బియ్యం బట్టలు పంపిణీ

- సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్, ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్, ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని అనాధ కుటుంబాలకు చెందిన వారికి బియ్యం,బట్టలు, పండ్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.సిఐ వెంట ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News