Dil Raju : చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు... సిగ్గు లేకుండా ఉండటమే ఇండస్ట్రీ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

దిల్ రాజు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కెరియర్ మొదట్లో ఎగ్జిబిటర్ గా డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగిన దిల్ రాజు ప్రస్తుతం సక్సెస్ఫుల్ నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు.ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే హరి శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాను నిర్మిస్తున్నాడు దిల్ రాజు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో కేవలం సినిమా విషయంలో మాత్రమే కాకుండా నిర్మాత దిల్ రాజు కాంట్రవర్సీల విషయంలో ఎక్కువగా హైలైట్ అవుతున్నారు.ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఒకదాని తర్వాత ఒకటి వివాదంలో చిక్కుకుంటున్నారు.కాగా ఆ మధ్య ఒకసారి కార్తికేయ 2 సినిమా రిలీజ్ విషయంలో సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపడ్డాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా ఏదో ఒక విషయంలో దిల్ రాజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.

సినిమా ఇండస్ట్రీలో ఎవరు తోపు కాదు.ఎవరు పెద్ద కాదు.సినిమాను ఎవరూ శాసించలేరు, నాకు కూడా అది సాధ్యం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా అంటే సిగ్గు, నీతి, మనం లేనిదే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు.సిగ్గు లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఇండస్ట్రీ అంటే అంటూ వ్యాఖ్యలు చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ఈ వాఖ్యలపై పలువురు నెటిజెన్స్ మండిపడుతున్నారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో అన్ని ఏళ్ల నుంచి ఉంటూ కూడా ఈ విధంగా వాఖ్యలు చేయడం సబబు కాదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు