టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు దిల్ రాజు.
ఇక ఈ సినిమాను అఫీషియల్గా స్టార్ట్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్టులను కూడా ఆయన త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో దిల్ రాజు ఎలాంటి సినిమాలు నిర్మి్ంచనున్నాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అయితే దిల్ రాజు పాన్ ఇండియా చిత్రంగా ప్రొడ్యూస్ చేయబోతున్న శంకర్-చరణ్ సినిమా అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
ఇక ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్తో ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాను దసరా నాటికి ప్రారంభించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.అటు ఈ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించే ‘ఐకాన్’ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయాలన దిల్ రాజు చూస్తున్నాడు.
ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసినా ఇంకా పట్టాలెక్కలేదనే విషయం తెలిసిందే.
దీంతో దిల్ రాజు తెరకెక్కించే ప్రాజెక్టులపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ సినిమాలను దిల్ రాజు ప్రెస్టీజియస్గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి, అదే స్థాయిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
మరి దిల్ రాజు ఈ వరుస సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమాలు పట్టాలెక్కి, రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.