తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వరలక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం నాంది.అల్లరి నరేష్ కెరియర్ లో అస్సలు కామెడీ అనేది లేకుండా వచ్చిన ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అల్లరి నరేష్ కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీగా నాంది విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.ఇక మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ హీరోల స్థాయిలోనే అదిరిపోయే విధంగా లాయర్ పాత్రలో నటించి మెప్పించింది.
కనకమేడల విజయ్ కుమార్ ఈ మూవీతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదిలా ఉంటే నాంది సక్సెస్ తర్వాత ఈ మూవీ రీమేక్ హక్కులని దిల్ రాజు సొంత చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం హిందీలో అజయ్ దేవగన్ తో కలిసారు.
హిందీలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించడానికి దిల్ రాజు రెడీ అయ్యారు.ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.ఇక వీరిద్దరితో పాటు పరాగ్ దేశాయ్, కుల్దీప్ రాథోడ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాణం కన్ఫర్మ్ అయిన ఇంకా డైరెక్టర్, ఇతర క్యాస్టింగ్ ఎవరనేది ఖరారు కాలేదు.
త్వరలో దీనిపై స్పష్టత ఇస్తామని దిల్ రాజు తెలిపారు.హిందీలో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం.
దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేశారు.ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.