లాక్‌డౌన్‌ సడలింపులపై భిన్న వాదనలు

దేశ వ్యాప్తంగా నిన్నటి నుండి లాక్‌డౌన్‌ను సఢలిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే.గ్రీన్‌ జోన్‌ మరియు ఆరెంజ్‌ జోన్‌లలో వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.

 Different Claims On Lockdown Easing Coronavirus,green Zone, Orange Zone, Red Zon-TeluguStop.com

కార్యక్రమాలు మొదలు అయ్యాయి.రెడ్‌ జోన్‌లలో కూడా కాస్త జనాలు కనిపించారు.

అయితే ఇదే సమయంలో నిన్న ఒక్క రోజే మూడు వేలకు పైగా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తున్న విషయం.వేలల్లో కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ను సఢలించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వలస కార్మికుల వేతనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వారి కోసం అంటూ లాక్‌డౌన్‌ను సడలించడం విడ్డూరంగా ఉందంటూ కాంగ్రెస్‌ నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.దేశ వ్యాప్తంగా కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల చివరి వరకు అయినా కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి దేశంలో ఈ సఢలింపుల వల్ల కేసుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లాక్‌ డౌన్‌ సఢలించడంతో సామాజిక దూరంకు జనాలు నీళ్లు వదిలేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube