చుండ్రు.ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.ఎన్ని షాంపూలు మార్చిన తలలో చుండ్రు మాత్రం తగ్గదు.తలలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాల వల్ల చుండ్రు ఏర్పడుతుంది.ఈ చుండ్రను తగ్గించుకొనేందుకు చాలా మంది యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడతారు.వీటి వల్ల తాత్కాలికంగా చుండ్రు తగ్గినా.
ఆ తర్వాత మళ్లీ వచ్చేస్తుంటుంది.అయితే సహాజ సిద్ధంగా కూడా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
మరి అందుకు ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.చుండ్రు సమస్య ఉన్నవారు.
ఒక బౌల్లో కొద్దిగా పసుపు మరియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.
అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
రెండొవది.ముందుగా పుదీనా ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.రసం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా వదిలేస్తుంది.
ఇక మూడొవది.
కరివేపాకు మరియు వేపాకు రెండు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్లో కొద్దిగా పెరుగు వేసి బాగామిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.ఒక గంట సమయం పాటు అలా వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కూడా తలలోని చర్మంపై ఉండే ఫంగస్ని దూరం చేసి.
చుండ్రును క్రమంగా తగ్గిస్తుంది.మరియు ఈ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.