నేనింకా తెలుగు మరిచిపోలేదు అంటున్న దియామీర్జా

పక్కా హైదరాబాదీ అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయని అందాల భామలు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు.

వారిలో దియామీర్జా కూడా ఒకరు.

ఈ భామ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మిస్ సౌత్ ఆసియా కిరీటం సొంతం చేసుకొని కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కెరియర్ ఆరంభంలో వరుస సినిమాలు చేసింది.

ప్రస్తుతం కెరియర్ అంత సాఫీగా లేకున్న ముంబైలోనే సెటిల్ అయిపొయింది.ఈ భామ ప్రస్తుతం తన కెరియర్ లో మొదటి తెలుగు సినిమా నాగార్జునతో కలిసి నటిస్తుంది.

వైల్డ్ డాగ్ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Advertisement

వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ వచ్చిన ఈ భామ చిత్ర విశేషాలని పంచుకుంది.

తానూ పక్కా హైదరాబాదీ అని చిన్నప్పుడు తెలుగు బాగా మాట్లాడేదాన్ని అని చెప్పుకొచ్చింది.తనకి తెలుగు చదవడం, రాయడం కూడా వచ్చని, ముంబైలో సెటిల్ అవ్వడం వలన ప్రస్తుతం కొంత పట్టు కోల్పోయిన కానీ స్పష్టంగా తెలుగులో మాట్లాడగలను అని చెప్పింది.అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగు నుంచి అవకాశాలు వచ్చిన కూడా మెప్పించే పాత్రలు రాలేదని, ఈ కారణంగానే ఇక్కడ సినిమాలు చేయలేకపోయానని స్పష్టం చేసింది.

నాగార్జున సిస్టర్ తో చిన్న వయస్సులో వారి ఇంటికి వెళ్లానని, ఇప్పుడు ఆయన ద్వారానే తెలుగులో ఎంట్రీ ఇస్తున్నానని చెప్పింది.వైల్డ్ డాగ్ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని స్పష్టం చేసింది.

దీనిని బట్టి ఆమె మొదటి ప్రాధాన్యత తెలుగు కాదని, అవకాశాన్ని బట్టి తెలుగులో నటిస్తానని తేల్చి చెప్పినట్లు అయ్యింది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు