ఖైదీ, మాస్టర్ సినిమాలతో కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.ఈ రెండు సినిమాలతో సౌత్ లో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న ఈ టాలెంటెడ్ స్టార్ ప్రస్తుతం కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని లాక్ డౌన్ కంటే ముందుగానే స్టార్ట్ చేశారు.అయితే కమల్ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలలో బిజీగా ఉన్నాడు.
ఎన్నికల అనంతరం ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే మాస్టర్ మూవీ హిందీలో రీమేక్ చేయడానికి లోకేష్ తోనే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
తక్కువ టైమ్ లోనే మోస్ట్ క్రేజియస్ట్ దర్శకుడుగా లోకేష్ కనగరాజ్ ఇమేజ్ సౌత్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది.ఈ నేపధ్యంలో తెలుగు హీరోలు కూడా లోకేష్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్, మహేష్ బాబు లకి లోకేష్ కథ చెప్పడం జరిగిందని టాక్ నడుస్తుంది.ఇందులో రామ్ చరణ్ లోకేష్ చెప్పిన కథ నచ్చి ఒకే చెప్పడం కూడా అయ్యిందని సమాచారం.
అయితే రామ్ చరణ్ లోకేష్ కంటే ముందుగా సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి పోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా లోకేష్ చెప్పిన కథకి ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బోగట్టా.
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని లోకేష్ కి ప్రభాస్ హామీ ఇచ్చినట్లు సమాచారం.