సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఫేక్ న్యూస్ చక్కెర్లు కొడుతూనే ఉంటుంది.జనాలు వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు.
వివరాల్లోకి వెళితే.చలానా పెండింగ్ లో ఉన్న వాహనాన్ని జప్తు చేసే అధికారం ఏ ట్రాఫిక్ పోలీస్ కు లేదని తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు పేర్కొంటూ.
సోషల్ మీడియాలో పోస్ట్ చక్కర్లు కొడుతుంది.ఆ వార్త అవాస్తవమని సైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తేల్చారు.
హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదని పేర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేసే తప్పుడు పోస్టులు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపేయాలని హెచ్చరించారు.
సెంట్రల్ మోటార్ వెహికల్(CMVR) రూల్స్ 1989 రూల్-167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్ చలానా పెండింగ్ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులు ఉందని సైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.సంబంధిత పెండింగ్ ఉన్న చలానా గురించి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా పోలీసులు ఒకసారి తెలియజేస్తే చాలని పేర్కొన్నారు.
ఏవైనా ట్రాఫిక్ వలన చలనాలు ఉన్నాయా లేవా అని తెలియ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులుదే.ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్ లైన్ ద్వారా అధికారులకు నివేదించవచ్చని పేర్కొన్నారు.