అది ముందే మొసలి.దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి.అంతటితో ఆగలేదు మొసలి.ఇంకా ఉంది చూస్తూనే ఉండండి అన్నట్లుగా ప్రవర్తించింది ఆ మకరం.దాని వింత ప్రవర్తన అక్కడి చుట్టు పక్కల గ్రామస్థులకు చాలా కొత్తగా అనిపించింది.అంతే కాదండోయ్ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు ఆ మొసలి ఎందుకలా ప్రవర్తించింది, ఏం చేసింది, దాని కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అది గుజరాత్ లోని వడోదరా ప్రాంతం.
భారీగా కురిసిన వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.వడోదరా సమీపంలోని విశ్వా మిత్ర నదిలో కూడా నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది.
ఈ నదిలోని మొసలికి ఎలా చిక్కాడో తెలియదు గానీ, 30 ఏళ్ల వ్యక్తి దానికి చిక్కాడు.ముందే మొసలి, అందులోని నది దాని సామ్రాజ్యం, నీటిలో దాని బలం రెట్టింపు అవుతుంది.
అయినా ఆ యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డాడు.కానీ దాని బలం ముందు ఆ యువకుడి బలం సరిపోలేదు.
అతడిని చంపేసింది.అంతటితో ఆగలేదు ఆ మకరం.
దాదాపు 2 గంటల పాటు అతడి మృతదేహంతో ఆటాడుకుంది.విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు.
ఘటనను చూసేందుకు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు.వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మృతి చెందిన వ్యక్తి పాద్రా గ్రామానికి చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు.