నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది నడుము నొప్పితో తీవ్రంగా సతమతం అవుతున్నారు.అలాగే వయసు పై పడటం, అధికంగా వ్యాయామాలు చేయడం, ధూమపానం, కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడటం, ప్రెగ్నెన్సీ, బరువు పెరగడం తదితర కారణాల వల్ల కూడా నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది.
కారణం ఏదైనప్పటికీ ఎక్కువ శాతం మంది నడుము నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.అయితే పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
కానీ, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండానే నడుము నొప్పిని తరిమి కొట్టవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పులు వేసి లైట్ గా వేయించుకోవాలి.అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్ వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన నిమ్మ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో బాదం పప్పులు, వాల్ నట్స్, ఒక కప్పు నల్ల ఎండు ద్రాక్ష వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, ఒక కప్పు తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజూ ఉదయాన్నే తీసుకోవాలి.
ఇలా ప్రతి రోజు కనుక చేస్తే నడుము నొప్పి క్రమంగా దూరం అవుతుంది.అలాగే ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.
జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా తగ్గుముఖం పడతాయి.