చిత్తూరు జిల్లాలో నిషేధిత డ్రగ్స్ కలకలం సృష్టించాయి.విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
కాగా నిందితుల్లో ఒకరు సుడాన్ దేశస్థుడిగా గుర్తించారు.అనంతరం నిందితుల నుంచి రూ.2 లక్షల విలువైన 34 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా సుడాన్ దేశస్థుడి నుంచి పాస్ పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.







