సమంత క్లోజ్‌ ఫ్రెండ్‌కు కరోనా.. టెస్టుకు వెళ్లనున్న అక్కినేని జంట

కరోనా వైరస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రముఖులను కూడా భయపెడుతోంది.ఇప్పటి వరకు డైరెక్ట్‌గా టాలీవుడ్‌ ప్రముఖులకు కరోనా సోకింది తక్కువే.

బండ్ల గణేష్‌ మాత్రమే కరోనాతో బాధపడుతున్నాడు.ఇక సెలబ్రెటీల బంధువులకు వారి మిత్రులకు కూడా కరోనా వచ్చింది.

అయితే మరికొన్ని రోజుల్లో టాలీవుడ్‌ వారికి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.తాజాగా సమంతకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన శిల్ప రెడ్డికి కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన శిల్ప రెడ్డి చాలా కాలంగా సమంతతో చాలా క్లోజ్‌గా ఉంటుంది.మూడు నాలుగు రోజుల క్రితం కూడా వీరిద్దరు కలిశారు.

Advertisement

ఆ సమయంలో శిల్ప రెడ్డికి సమంత గట్టిగా ముద్దు కూడా పెట్టింది.ఆ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

సమంత పోస్ట్‌ చేసిన ఆ పోస్ట్‌ వైరల్‌ అయిన కొద్ది రోజులకే శిల్ప రెడ్డికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో సమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమెకు ఏమైనా కరోనా వచ్చి ఉంటుందా అంటూ టెన్షన్‌ పడుతున్నారు.

మూడు నాలుగు రోజుల క్రితం శిల్ప, సమంత కలిసి ఉంటే ఖచ్చితంగా సమంత మాత్రం టెస్టు చేయించుకోవాల్సిందే.సమంతతో పాటు నాగచైతన్య కూడా టెస్టుకు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు.భార్య భర్తలు ఇద్దరు కూడా టెస్టు చేసుకుంటేనే బాగుంటుందని.

అలాగే వారి కుటుంబం కోసం పని చేసే వారికి కూడా టెస్టులు నిర్వహించాలనే డిమాండ్‌ వినిపిస్తుంది.రెండు మూడు రోజుల్లో సమంత ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు