Minister Jupalli Krishnarao : నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది..: మంత్రి జూపల్లి

కృష్ణా జలాల్లో నీటి వాటా అంశంలో రాజీపడేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishnarao ) అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే కృష్ణా జల్లాల్లో( Krishna River Water ) ఏపీ దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు.తెలంగాణ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడించారు.ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు