మనకు ఏ లాటరీ తగిలితోనో లేదంటే లంకె బిందెల వంటివి దొరికితే తప్ప ఒక్క రోజులో కోటీశ్వరులం అవ్వలేం.కానీ ఓ ఉద్యోగి మాత్రం ఒకే ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యాడు.
అప్పటి వరకు నెల జీతం తీస్కుంటే పని చేసే అతను… ఈ నెల రావవాల్సిన జీతంతో జాక్ పాట్ కొట్టేశాడు.ఎందుకంటే ఈ సంస్థ వాళ్లు అతనికి వచ్చే జీతం కంటే దాదాపు 330 రెట్లు ఎక్కువ వేశారు.
అదేం వాళ్లు అతనికి జీతం పెంచో వేయలేదు.పొరపాటును, అనుకోకుండా వేసేశారు.
అయితే ఈ విషయాన్ని కూడా ఆ ఉద్యోగి చెప్తేనే తెలుసుకున్నారు.మరి చివరకు ఏమైందో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
చిలీ దేశంలోని మాంసాహార ఉత్పత్తి సంస్థ సీఐఏఎల్ అలిమెంటోస్ కి చెందిన ఓ ఉద్యోగి గత కొన్నేళ్లుగా ఆ సంస్థలోనే పని చేస్తున్నాడు.అయితే అతడికి 5,00,000 చిలియన్ పెసోస్ (రూ.43,028).అయితే అతనికి వచ్చిన మొత్తం మాత్రం 165,398,,851 చిలియన్ పెసోస్ (రూ.1.42 కోట్లు). ఈ జీతం మే 30వ తేదీన తన అకౌంట్ లో జమ అయింది.అయితే ఈ విషయాన్ని ఆ ఉద్యోగి తన డిప్యూటీ మేనేజర్ తో చెప్పాడు.

అలా యాజమాన్యానికి ఈ విషయం తెలిసింది.ఉద్యోగిని సంప్రదించగా… బ్యాంకుకు వెళ్లి తీసుకొస్తానన్నాడు.కానీ మరుసటి రోజు నుంచి వారికి స్పందించడం మానేశాడు.ఓ మూడు రోజుల తర్వాత లాయర్ ద్వారా తన రాజీనామా లేఖను అందించి పరారయ్యాడు.అప్పటి నుంచి అతని జాడ లేదని… మరోవైపు ఉద్యోిగపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యా దు చేసింది.