నల్గొండ జిల్లా దామరచర్లలో సీఎం కేసీఆర్ పర్యటన

నల్గొండ జిల్లా దామరచర్లలో సీఎం కేసీఆర్ పర్యటించారు.ఇందులో భాగంగా థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంతాన్ని ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

అనంతరం థర్మల్ పవర్ ప్లాంట్ పనులను కేసీఆర్ పరిశీలించారు.ఈ నేపథ్యంలో పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పవర్ ప్లాంటు నిర్మాణ పనులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.ఈ క్రమంలో నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.

సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.అయితే 2015 జూన్ లో రూ.29,992 కోట్లతో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే ప్లాంట్ లో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి.

Advertisement

మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి.వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా మొదటి యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు