మునుగోడుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

దీంతో అధికార టీఆర్ఎస్, విప‌క్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు స‌వాళ్లు విసురుకుంటున్నారు.మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌దే విజ‌య‌మంటూ ఎవ‌రికీ వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, మునుగోడుపై సీఎం కేసీఆర్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.మంత్రులు హ‌రీశ్ రావు, జ‌గదీశ్ రెడ్డిల‌తో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధితో పాటు తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు.

అనంత‌రం మునుగోడులో విజ‌యం సాధించ‌డానికి ఏం చ‌ర్య‌లు తీసుకోవాల‌నే దానిపై పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశం ఉంది.

Advertisement
కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం

తాజా వార్తలు