ఇడుపులపాయలో వైయస్సార్ కి నివాళులు అర్పించిన సీఎం జగన్..!!

నేడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, వైయస్ షర్మిల, వైయస్ భారతి పాల్గొన్నారు.

ఇంకా కొంతమంది మంత్రులు మరియు కడప జిల్లాకు చెందిన నాయకులు వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో.

"నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి.దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.

ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు.ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది".

Advertisement

అని సీఎం జగన్ పోస్ట్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సైతం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మరియు వైయస్సార్ అభిమానులు భారీ ఎత్తున వైయస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సత్తిబాబు జగన్ నమ్మకాన్ని నిలబెడతారా  ? 
Advertisement

తాజా వార్తలు