కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ప్రచారం ...?

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్టుగా ఉంటూ.అసలు కనీసం తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ముఖం చూపించని మెగా స్టార్ చిరంజీవి గురించి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

త్వరలో .ఏపీలో జరగనున్న ఎన్నికల్లో .హీరో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రఘువీరారెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదంటూ చెప్పుకొచ్చారు.

పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తనదైనశైలిలో విమర్శలు చేశారు.వైసీపీ లాంటి బ్రోకర్ పార్టీ మద్దతు తమకు అవసరం లేదని ఘాటుగా ఆరోపించారు.కేసీఆర్ తో కలిసి వైసీపీ దమ్ముంటే ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో సింగిల్ గానే పోటీ చేస్తామన్నారు.మాకు 175స్థానాల్లో బలమైన అభ్యర్థులున్నారని స్పష్టం చేశారు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు