ప్రపంచాన్ని నాశనం చేసి.. ఎంజాయ్ చేస్తున్న వుహాన్ ప్రజలు!

8 నెలలలో ప్రపంచమంతా అన్ని విధాలుగా నాశనం అయ్యింది.ఇలా నాశనం అవ్వడానికి కారణం చైనాలోని వుహాన్ నగరం.

ఎందుకంటే చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఆ నగరం నుంచి మెల్లగా వ్యాపిస్తుంది దేశం అంతా వ్యాపించి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది.దీంతో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోయింది.

చివరికి ప్రపంచ దేశాలు కొన్ని నెలల పాటు లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది.కేవలం చైనాలోని వుహాన్ నగరం కారణంగా రెండు కోట్లమందికిపైగా ప్రజలకు కరోనా వైరస్ భారిన పడ్డారు.

అందులో కోటి 50 లక్షలమంది కరోనాతో పోరాడి కోలుకోగా 7 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.ఇలా ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే వుహాన్ ప్రజలు మాత్రం కనీసం మాస్కులు కూడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.వుహాన్‌లోని మాయా బీచ్ పార్క్‌లో ఆదివారం పెద్ద మ్యూజిక్ పార్టీ జ‌రిగింది.

ఆ పార్టీలో ఎంతోమంది కరోనాకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేశారు.భౌతిక దూరం, మాస్క్, శానిటైజర్ ఏం వేసుకోకుండా అసలు కరోనా లేదు అన్నట్టు వేలాదిమంది చైనీయులు ఆ పార్టీలో పాల్గొన్నారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పార్టీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని సర్వ నాశనం చేసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పార్టీలో ఏ ఒక్కరికి కరోనా వైరస్ ఉన్నా చైనాలో మళ్లీ లక్షల కేసులు నమోదవ్వడం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు ఇల్లు కూడా దాటడం లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాంటిది వీరు ఏకంగా పార్టీ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు