నాగ్ తో చందు సినిమా మిస్ అయ్యిందట..!

కార్తికేయ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన దర్శకుడు చందు మొండేటి.

ఏకంగా రాజమౌళి దగ్గర నుండే మెప్పు పొందిన చందు ఇప్పుడు చైతు ప్రేమంతో రాబోతున్నాడు.

అయితే చైతన్య మాత్రం చందు టాలెంట్ కు ఫిదా అయ్యాడట అదే విషయాన్ని ఆడియో వేడుకలో కూడా చెప్పాడు.ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా తన దర్శకుడు చందు ప్రతిభ గురించి నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

ఇక కార్తికేయ కంటే ముందే నాగార్జునను కలిసి కథ చెప్పాడట చందు.కథ నచ్చినా నాగ్ డేట్స్ అడ్జెస్ట్ అయ్యేట్లు లేవని తెలియడంతో నిఖిల్ తో కార్తికేయ తీసి హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత నాగార్జునను కలిస్తే ముందు చైతుతో తీస్తే ఆ తర్వాత తను అవకాశం ఇస్తా అని చెప్పాడట.నాగ చైతన్య కోసం ఓ కథ సిద్ధం చేయగా చైతు మాత్రం ప్రేమం రీమేక్ చేయమని అడిగాడట.

Advertisement

సో అలా చందు ప్రేమం రీమేక్ దర్శకుడయ్యాడు.రీమేక్ సినిమానే అయినా చందు తన క్రియేటివిటీ మొత్తం సినిమాలో పెట్టాడని తప్పకుండా తనతో ఓ స్ట్రైట్ సినిమా చేస్తానని చెప్పాడు నాగ చైతన్య.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు