అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై దర్యాప్తు చేయాలి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఈరోజు ఉదయం విశాఖ జిల్లా అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీ( Atchutapuram SEZ Pharma Company )లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.

పలువురు గాయపడ్డారు.గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది.

దీంతో గాయపడినవారిని కేజీహెచ్ కు తరలించడం జరిగింది.కాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( TDP Leader Chandrababu Naidu ) స్పందించారు.

సాహితీ ఫార్మా అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందటం బాధాకరమని అన్నారు.ఇదే సమయంలో ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలి.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలి అని చంద్రబాబు సూచించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ ఘటనలో మృతులకు 25 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది.

ఇదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు.మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడటం జరిగింది.

పోలీసుల సైతం ఘటన స్థలంలో సహాయ సహకారాలు అందించారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు