అమిత్ షా, జేపీ నడ్డాలతో ముగిసిన చంద్రబాబు భేటీ..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో( JP Nadda ) కలసి సమావేశమయ్యారు.

 Chandrababu's Meeting Ended With Amit Shah And Jp Nadda,  Chandrababu Naidu,  Am-TeluguStop.com

దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పొత్తులపై తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇక ఇదే సమయంలో ఆదివారం ఉదయం ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీలో రాజకీయాలు ఇంకా పొత్తులపై పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ రెడీ బీజేపీతో జనసేన( Jana sena ) పొత్తులో ఉంది.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా కలిస్తే 2014 మాదిరిగా వచ్చే 2024 ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు.వార్తలు వస్తున్నాయి.

మరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పొత్తుల విషయంలో బీజేపీ పార్టీ పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube