ఏపీపీఎస్సీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సీరియస్ అయ్యారు.రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ( APPSC ) మారిందని ఆరోపించారు.
ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న చంద్రబాబు ఏపీపీఎస్సీ ఛైర్మన్ కోర్టులను తప్పుదారి పట్టించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే డిజిటల్ వాల్యుయేషన్ చేయడం మొదటి తప్పన్నారు.
దాని తరువాత మాన్యువల్ వాల్యుయేషన్ చేశారని పేర్కొన్నారు.
ఆ తరువాత మరోసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారని తెలిపారు.
రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టును తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.ఏపీపీఎస్సీలో జరిగే అక్రమాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) స్పందించాలన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.