టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఒత్తిడి.ఓ ఎమ్మెల్యే కొంపముంచిందా? ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహానికి గురి చేసిందా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విషయం అసెంబ్లీ శీతాకాల సమావేశా ల చివరిరోజు చాలా హాట్ టాపిక్గా మారిపోయింది.ఇన్నాళ్లుగా అంటే గడిచిన నాలుగు రోజులుగా జరిగిన సభ ఒక లెక్క ప్రకా రం సాగితే చివరిరోజు మాత్రం మరింత హీటెక్కాయి.ప్రధానంగా టీడీపీ సభ్యుడు రామానాయుడు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి.
విషయంలోకి వెళ్తే వైఎస్సార్ భరోసా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లు నిండిన వారికి నెలకు మూడు వేలు ఇస్తానని చెప్పారని రామానాయుడు అన్నారు.దీనికి కేవలం 18 వేలకు తగ్గించారని దీంతో సదరు మహిళలు.17 వేల వరకు నష్టపోతున్నారని అన్నారు.దీంతో ఒక్కసారిగా జగన్ విజృంభించారు.
నిమ్మల రామానాయుడు ఉద్దేశ పూర్వకంగా నే తప్పులు చెబుతున్నారని, అబద్ధాలు ఆడుతున్నారని జగన్ ఊగిపోయారు.ఇలాంటి నాయకుడికి మైక్ ఇవ్వొద్దంటూ స్పీకర్కు పదేపదే విజ్ఞప్తి చేశారు.
తాము ఈ పథకాన్ని చెప్పినట్టే అమలు చేస్తున్నామంటూ మేనిఫెస్టోను తీసి చూపించారు.
కట్ చేస్తే.
రామానాయుడుకు మైక్ కట్ అయింది.అయితే ఇది ఇంతటితో ఆగిపోతుందా? అంటే ఇప్పుడున్న వైసీపీ పొలిటిక ల్ స్ట్రాటజీ ప్రకారం వచ్చే మూడేళ్లపాటు కూడా నిమ్మలకు అవకాశం వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.ఇదిలా వుంటే రామా నాయుడు తప్పు మాట్లాడారా? అనే విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడారనేది వాస్తవమని అంటున్నారు పరిశీలకులు.
గడిచిన నాలుగు రోజులుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబును మరింత మచ్చిక చేసుకునే ఉద్దేశం కావొచ్చు లేదా అధినేత కనుసన్నల్లో కావొచ్చు సబ్జెక్టు విషయంలో కూలంకషమైన పట్టు లేక పోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.మొత్తానికి రామానాయుడు పరిస్థితి మున్ముందు ఎలా మారుతుందో చూడాలి.