టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
దీని తరువాత వరుసగా చిరంజీవి రెండు రీమేక్ లని లైన్ లో పెట్టాడు.అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ఒకటి కాగా మరొకటి మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్.
ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ బాధ్యతలు సుజిత్ నుంచి వివి వినాయక్ చేతికి వచ్చాయి.
ఇప్పుడు అతను కూడా తప్పుకోవడంతో తనీ ఒరువన్ దర్శకుడు మోహన్ రాజాకి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు.ఇక మోహన్ రాజా ఈ సినిమాకి ఇప్పుడు స్క్రీన్ ప్లే రాసే పనిలో ఉన్నారు.
స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది కావడం విశేషం.
మొదటి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం రావడంతో ఈ రీమేక్ లో అతన్ని మరింత పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు చిరంజీవి కెరియర్ లో హీరోయిన్ లేకుండా మొదటి సారి ఈ సినిమాలో నటించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమాకి బైరెడ్డి అనే ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఫ్యాక్షన్, మాఫియా లింక్ చేసే విధంగా కథ ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ కూడా భావించినట్లు సమాచారం.
త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం బయటకి వచ్చే అవకాశం ఉంది.







