రష్మీ అందాలపై కేసు

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూర్‌ టాకీస్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దు జొన్నల గడ్డ మరియు నరేష్‌లు ముఖ్య పాత్రలో నటించారు.

జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినీ వర్గాల్లో అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.అయితే అంచనాలను ఈ సినిమా అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.

ఈ సినిమా కథ కంటే రష్మీ అందాలే ఎక్కువ అయ్యాయి అనే విమర్శలు వస్తున్నాయి.ఇక ఈ సినిమాకు మరో షాక్‌ తగిలింది.

ఈ చిత్రంలో దర్శకుడు వికలాంగులను అవమానపర్చడంతో పాటు, వృద్దులను మరియు మహిళలను కించపర్చేలా పలు సీన్స్‌ను చిత్రీకరించాడు అని, ఆ సీన్స్‌ మనో భావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి అంటూ ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.కేసును బుక్‌ చేసుకున్న పోలీసులు విచారణ చెప్పటనున్నారు.

Advertisement

దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుకు త్వరలోనే పోలీసులు నోటీసులు పంపే అవకాశాలున్నాయి.ఇప్పటికే సినిమాకు కలెక్షన్స్‌ రాక నిరాశలో ఉన్న చిత్ర యూనిట్‌ సభ్యులకు ఈ కోర్టు వివాదం మరింత తలనొప్పులను తెచ్చి పెడుతోంది.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Advertisement

తాజా వార్తలు