కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకునాయకులు

గంభీరావుపేట్ :కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తు గంభీరావుపేట మండల కేంద్రమలోని తెలంగాణ స్తూపం వద్ద భారత రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.

వంటగ్యాస్ సిలిండర్లను రోడ్డుపై ఏర్పాటు చేసి కట్టెల పొయ్యి వెలిగించి పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము గ్యాస్ ధర పెంపు పై తీవ్రంగా మండిపడ్డారు.మహిళ దినోత్సవము సందర్భంగా మహిళలకు గిఫ్ట్ గా వంట గ్యాస్ పెంచాడని అన్నారు.

వంట గ్యాస్ ధరల పెంపుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అని పేర్కొన్నారు.వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వన్ని హెచ్చరించారు.

రాస్తారోకోతో రోడ్డుపై భారీగావాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో ఎంపిపి కరుణ, వైస్ ఎంపిపి లత, జెడ్పీటీసీ విజయ, తెరాస సినియరు నాయకులూ,పాల్గోన్నారు.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

Latest Rajanna Sircilla News