ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో ఎన్నికల్లో భాగంగా బిఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సిరిసిల్ల రూలర్ సీఐ సదన్ కుమార్, హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో నిర్వహిస్తున్న బందోబస్తులో ముస్తాబాద్ తేర్లుమద్ది లో బిఎస్ఎఫ్ ఫోర్స్ తో కవాతు నిర్వహించామని తెలిపారు.

మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన పోలీస్ కవాతు కొత్త బస్టాండ్ చౌరస్తా, పాత బస్టాండ్, మార్కెట్, పెద్ద బజార్, మీదుగా హై స్కూల్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, వరకు కవాతు కొనసాగించారు, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండలంలోని పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక మైనవిగా గుర్తించినందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు, ప్రజలందరూ స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News