తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తుంది.మొదటి దఫా ప్రచారాన్ని పూర్తిచేసిన గులాబీ బాస్ రెండో విడత ప్రచారంలో దూకుడు పెంచారు.

 Brs Aggression In Telangana Election Campaign-TeluguStop.com

ఇందులో భాగంగా నిన్న మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ ఇవాళ కూడా మూడు సభలకు హాజరుకానున్నారు.పాలేరు, వర్ధన్నపేటతో పాటు మహబూబాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్ల చెరువులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి ఎన్నికల సభ కావడంతో బీఆర్ఎస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు.

ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.అలాగే సభా వేదిక ముుందు సుమారు 70 టన్నుల ఇసుకతో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.

పాలేరు సభ తరువాత వర్ధన్నపేట, మహబూబాబాద్ లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.ఇందులో భాగంగా ప్రభుత్వం చేసిన అభివృద్దితో పాటు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube