ఎల్లమ్మ తల్లి కి ఘనంగా బోనాల పండుగ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి( Sri Renuka Yellamma ) కి పందిర్ల లింగం గౌడ్ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ జరిగింది .

ఆషాఢ మాసం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పందిర్ల లింగం గౌడ్, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, పందిర్ల బాల్ రాజు గౌడ్ లు తమ తమ ఇండ్ల నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు.

డప్పు చప్పుల్లతో మహిళలు బోనమెత్తి మొక్కలు చెల్లించుకున్నారు.శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయపూజారి నవీన్ చారి ప్రత్యేక పూజలు చేసి టేంకాయలు కొట్టి బోనాలు సమర్ఫించుకున్నారు .ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , కాంగ్రెస్, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి , గిరిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు బండారి బాల్ రెడ్డి, గుండాడి రాం రెడ్డి, సూడిది రాజేందర్, నంది కిషన్, గుర్రపు రాములు, పందిర్ల సుధాకర్ గౌడ్, గంట రమేష్ గౌడ్, మెండె శ్రీ నివాస్ యాదవ్, గంట కార్తిక్ గౌడ్, బుచ్చి లింగి సంతోష్ గౌడ్, , మర్త న్నపేట లక్ష్మన్ గౌడ్ , అంతేర్పుల గోపాల్ , తదితరులు పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు , అనంతరం పూజారి నవీన్ చారి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

ఫిట్నెస్ లేని ప్రైవేటు కళాశాల పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి

Latest Rajanna Sircilla News