చనిపోవడానికి ముందు వీడ్కోలు తీసుకుంటూ హీరోయిన్ పోస్ట్... క్యాన్సర్ తో మృతి

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా లోకం వీడుతున్నారు.

కొంతమంది అనారోగ్య సమస్యలతో మృతి చెందగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు.ఈ విషాద ఘటనలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఈ ఏడాది తీవ్ర దుఃఖంలో ముంచుతున్నాయి.

మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు క్యాన్సర్ బారిన పడుతున్నారు.అలాంటి వారిలో కొందరు మృత్యువుతో పోరాడి గెలిచి బయటకు వచ్చారు.

అయితే తాజాగా ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చౌక్సే క్యాన్సర్ తుది శ్వాస విడిచారు.గత కొంతకాలంగా క్యాన్సర్‌తో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

Advertisement

అయితే ఆమె పరిస్థితి మెరుగు పడకపోగా మరింత విషమించింది.దీంతో ఆదివారం అని కన్ను మూసింది.

ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించి దివ్య బంధువు సౌమ్యా అమిష్‌వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.తనను తాను క్యాన్సర్ సర్వైవర్‌ గా గర్వంగా చెప్పుకున్న దివ్య చివరికి ప్రాణాంతక వ్యాధికి తలవంచక తప్పలేదంటూ ఆమె అభిమానులు నివాళులర్పించారు.మరణానికి కొన్ని గంటల ముందు దివ్య చౌక్సే సోషల్‌మీడియాలో హృదయాన్ని మెలిపెట్టే పోస్టుతో ఈ ప్రపంచానికి గుడ్‌బై చెప్పింది.

సుదీర్ఘం కాలం క్యాన్సర్‌ తో బాధపడుతూ నెలల తరబడి మరణశయ్యపై ఉన్నాను.బాధ లేని మరో జన్మలో కలుద్దాం.సెలవంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో తుది వీడ్కోలు తీసుకున్నారు.2011 సంవత్సరంలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్నారు.2016 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫేమ్ సాహిల్ ఆనంద్‌తో కలిసి హై అప్పా దిల్ తోహ్ అవారా సినిమాలో నటించిన ఆమె పలు యాడ్ సినిమాలు, టెలివిజన్ షోలలో కూడా నటించారు.పాటియలే డి క్వీన్ తో సాంగ్‌తో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు