అందమైన సరస్సు, దాని చుట్టూ పర్వతాలు ఉన్న ప్రదేశంలో నీటి వెంబడి వెళ్లడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ద్వారా వచ్చే అనుభూతి వేరు.హైదరాబాద్ నగర వాసులకు ఈ అనుభూతి పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.ఒకటి దుర్గం చెరువు అని చెప్పవచ్చు.63 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దుర్గం చెరువు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి కనులవిందు చేస్తుంది.మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల మధ్య ఉన్న ఇనార్బిట్ మాల్ సమీపంలో దుర్గం చెరువు ఉంటుంది.
వీకెండ్లో బాగా చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ బెస్ట్ గా నిలుస్తుంది.
ఇది హైదరాబాద్లోని అత్యంత సుందరమైన, ప్రసిద్ధ సందర్శనా స్థలాలలో ఒకటిగా పేరుగాంచింది.ఈ ప్రదేశంలో మెకనైజ్డ్ బోట్లు, పెడల్ బోట్లు, వాటర్ స్కూటర్లతో సహా అనేక బోట్ ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ లభించే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ ఒక్కో పర్సన్కి స్పీడ్ బోట్ ధర రూ.400 మాత్రమే ఉంటుంది.స్పీడ్ బోట్లో నలుగురు కూర్చోవచ్చు.
ఈ బోట్ ప్రయాణం మిమ్మల్ని 15 నిమిషాల పాటు అత్యంత సుందరమైన నీటి చుట్టూ తీసుకెళ్తుంది.కాబట్టి ప్రశాంతంగా కూర్చుని అందమైన దృశ్యాలను ఎంజాయ్ చేయవచ్చు.
సందడిగా ఉండే సైబర్సిటీ మధ్యలో ప్రశాంతమైన ప్రదేశం ఇది.అన్ని చివర్లలో గ్రానైట్తో సరిహద్దులుగా.రాళ్లతో దాగి ఉన్నందున దీనిని ‘సీక్రెట్ లేక్’ అని కూడా పిలుస్తారు.ఈ బ్యూటిఫుల్ లేక్ కచ్చితంగా చూడదగినదే.