చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ మహా ధర్నా

సహకార రంగాన్ని టిడిపి , వైసిపి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని బిజెపి ఆరోపించింది .

సహకార రంగం లోని చిత్తూరు విజయ డైరీ , చక్కెర కర్మాగారాలను పునప్రారంబించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టింది.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు సహకార డైరీ ని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు , దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక ,మద్యం తదితర అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు .రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోలా ఆనంద్ , చిట్టి బాబు , నిషాదరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు