బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతున్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బుల్లితెర నటీనటులు యూట్యూబ్ స్టార్స్ సింగర్స్ యాంకర్స్ ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు బుల్లితెర నటి కీర్తి కేశవ్ భట్.
ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో హిమ పాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన కీర్తి తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
కుటుంబం మొత్తం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా అందరూ రోడ్డు ప్రమాదంలో మరణించారని తాను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.ఇలా తన కుటుంబంలో తానొక్కటే మిగలడంతో తమ బంధువులు తన ఆస్తిని లాక్కొని తనని రోడ్డుపైకి నెట్టారని ఈ వేదికపై కీర్తి వెల్లడించారు.
ఇలా జీవితమే లేదన్న తనకు ఇండస్ట్రీ జీవితాన్ని ఇచ్చిందని ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పారు.ఇకపోతే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి అనాధగా మిగిలిన ఈమె మరొక అనాధను దత్తత తీసుకొని పెంచుకుంటున్నట్లు ఈ సందర్భంగా కీర్తి భట్ తాను దత్తత తీసుకున్న విషయాన్ని వెల్లడించారు.ఇలా ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా మరొక అనాధకు జీవితాన్ని ఇచ్చారని తెలియడంతో ఈమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి భట్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.