కళ్ళ కింద నలుపు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే సమస్య ఇది.
స్మార్ట్ఫోన్లను అధికంగా వినియోగించడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల కళ్ళ కింద నలుపు ఏర్పడుతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలీక.
అసలు ఈ నలుపును ఎలా నివారించుకోవాలో అర్థం గాక తెగ బాధపడిపోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ను పాటిస్తే సులువుగా కళ్ళ కింద ఏర్పిడిన నలుపును పోగొట్టుకోవచ్చు.
మరి ఆ రెమెడీస్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని.
అందులో కొన్ని పాలకూర ఆకులు వేసి వాటర్ సాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్లో అర స్పూన్ తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే గనుక కళ్ళ కింద నలుపు నాలుగు రోజుల్లోనే తగ్గు ముఖం పడుతుంది.
అలాగే కళ్ళ కింద నలుపును తగ్గించే మరో సూపర్ రెమెడీ ఏంటంటే.మిక్సీ జార్లో అర కప్పు బొప్పాయి, మూడు స్పూన్ల ఉసిరి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.ఇప్పుడు ఈ పేస్ట్ను కళ్ళ కింద పూసి బాగా ఆరబెట్టుకోవాలి.
ఆపై చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా కళ్ళ కింద నలుపు మాయం అవుతుంది.
ఇక ఈ రెమెడీస్తో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.స్మార్ట్ఫోన్ను వినియోగించడం తగ్గించాలి.వాటర్తో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటివి తాగాలి.రోజూ వ్యాయామాలు చేస్తుండాలి.
మరియు డైట్లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.