సాధారణంగా కొందరు తరచూ నీరస పడిపోతూ ఉంటారు.ఎంత ఫుడ్ తీసుకున్నా.
మళ్లీ కొంత సమయానికే నీరసం వచ్చేస్తుంటుంది.విశ్రాంతి తీసుకున్నా నీరసం వదలనే వదలదు.
దాంతో ఏ పని చేయలేకపోతుంటారు.ఏ విషయంలోనూ ఇంట్రస్ట్ పెట్టలేరు.
రక్త హీనత, ఒత్తిడి, పోషకాల లోపం, ఆందోళన, నీళ్లు సరిగ్గా తాగక పోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, బ్రేక్ ఫాస్ట్ను స్కిప్ చేయడం, హార్మోన్లలో మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల తరచూ నీరసం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
దాంతో నీరసాన్ని నివారించుకునేందుకు చాలా మంది మందులు వాడతారు.అయితే కొన్ని కొన్ని పండ్లు తీసుకోవడం ద్వారా కూడా నీరసానికి చెక్ పెట్టవచ్చు.మరి ఆ పండ్లు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లు రుచిగా ఉండటమే కాదు.ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా నీరసంతో ఇబ్బంది పడే వారు.రోజుకో జామ పండును తీసుకుంటే శరీరానికి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అందుతాయి.
దాంతో నీరసం తగ్గి.ఫుల్ యాక్టివ్గా మారతారు.
నీరసాన్ని, అలసటను తగ్గించి.తక్షణ శక్తిని అందించడంలో దానిమ్మ పండ్లు గ్రేట్గా సహాయపడతాయి.దానిమ్మను జ్యూస్ రూపంలో తీసుకుంటే మరింత ఫలితం ఉంటుంది.
ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అనేక ప్రయోజనాలను అందించే కివి పండుకి కూడా నీరసాన్ని తగ్గించే శక్తి ఉంది.
పైగా కివి పండు తీసుకుంటే.గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
రక్త పోటు కంట్రోల్ లో ఉంది.మరియు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇక నీరసాన్ని నివారించి.శరీరాన్ని ఎనర్జిటిక్గా మార్చడంలో స్ట్రాబెర్రీస్ సహాయపడతాయి.రెగ్యులర్గా తగిన మోతాదులో స్ట్రాబెర్రీస్ ను తీసుకుంటే నీరసం దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.వీటితో పాటుగా బొప్పాయి పండు, అరటి పండ్లు కూడా నీరసాన్ని తగ్గించగలవు.