ఛత్రపతి కోసం రంగంలోకి దిగిన బెల్లంకొండ బాబు

బెల్లంకొండ సురేష్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా నుంచి తండ్రి సహకారంతో కమర్షియల్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో వీలైనంత వరకు కమర్షియల్ యాక్షన్ కథలనే ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

స్టార్ హీరోయిన్స్, స్టార్ దర్శకులతోనే ఎక్కువ జత జడుతున్నాడు.అలాగే తన మార్కెట్ కి మించి సినిమా కోసం ఖర్చు చేయిస్తున్నారు.

తండ్రి బ్యాక్ బోన్ గా వెనకే ఉండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫేమ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాతో ఈ బాబు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

అయితే సినిమా ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది.అరిగిపోయిన మూస కథనే మళ్ళీ దర్శకుడు హీరో, క్యారెక్టర్స్ మార్చి తీసాడని అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వచ్చింది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ మూవీ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తన రిహార్సల్స్ స్టార్ట్ చేశాడు.ఇప్పటికే ముంబై చెక్కేసి అక్కడ సినిమా పనిలో మునిగిపోయాడు.వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. జయంతిలాల్ గడ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు