బెల్లంకొండ గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన సినిమా స్వాతిముత్యం.సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది.
పోటీగా రెండు పెద్ద హీరోల సినిమాలు వస్తున్నా సరే తగ్గేదేలే అన్నట్టుగా స్వాతిముత్యం టీం వస్తుంది.అయితే ఈ సినిమాకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అంటే.
అది గురూజీ త్రివిక్రం వల్లే అని అంటున్నారు.స్వాతిముత్యం సినిమా దసరా రేసులో ఉండటానికి అసలు కారణం త్రివిక్రం అని అంటున్నారు.
హారిక హాసిని, సితార బ్యానర్ రెండు త్రివిక్రం సొంత బ్యానర్ ల లెక్క.అందుకే ఆ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా సరే త్రివిక్రం ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది.స్వాతిముత్యం సినిమా వెనక కూడా త్రివిక్రం హ్యాండ్ ఉందని తెలుస్తుంది.సినిమా స్క్రిప్ట్ నుంచి అవుట్ పుట్ వరకు త్రివిక్రం కూడా సపోర్ట్ గా ఉన్నారట.అందుకే ఈ సినిమాకు అంత బజ్ ఏర్పడిందని తెలుస్తుంది.అంతేకాదు సినిమా పండుగకి రిలీజైతే ఆ సినిమాల టికెట్స్ దొరక్కపోతే దీనికి వస్తారని ప్లాన్ చేశారట.
మొత్తానికి స్వాతిముత్యం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది కాబట్టి సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని చెప్పొచ్చు.