రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో ఎలుగుబంటి( Bear ) సంచరించినట్లు గురువారం చూసిన ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు( Forest officials ) రాగట్లపల్లి నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గురువారం రాత్రి వరకు గాలించారు.
అయినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు.నారాయణపురం , రాగట్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంత ప్రజలను కోరారు.