ఎంఐఎం పార్టీ పై సీరియస్ కామెంట్స్ చేసిన బండి సంజయ్..!!

తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలలో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికి ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో తాలిబన్లకు సహకరిస్తున్న వారిని తరిమి కొడతామని స్పష్టం చేశారు.

దేశంలో 80 శాతం ఉన్న హిందువుల కోసం బిజెపి తాలిబాన్లకు సహకరిస్తున్న ఎంఐఎం పార్టీని సహకరిస్తున్న తోక పార్టీలను తెలంగాణ రాష్ట్రం నుండి కచ్చితంగా తరిమి కొడదామని బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర చేసిన ప్రసంగంలో సీరియస్ గా ప్రసంగించారు.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ పాలన నియంత్రించడానికి.

ప్రజాస్వామ్య పాలన నెలకొల్పడానికి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నట్లు ప్రజలు కచ్చితంగా ఆదరించటం జరుగుతుందని తెలిపారు.కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడం జరుగుతుంది అని కూడా స్పష్టం చేశారు.

Advertisement

 ఏది ఏమైనా బండి సంజయ్ స్టార్ట్ చేసిన పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పెను సంచలనంగా మారింది.

మంత్రి గారి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు వార్నింగ్
Advertisement

తాజా వార్తలు