నాయీ బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచే ప‌దాలు నిషేధంః ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు

నాయీ బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచే ప‌దాల‌ను ఏపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.మంగ‌లి, మంగ‌లోడా, మంగ‌లిది, కొండ మంగ‌లి అనే ప‌దాల‌ను ఉప‌యోగిస్తే నాయీ బ్రాహ్మ‌ణుల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్టుగా, వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్టుగా భావిస్తార‌ని పేర్కొంది.

 Ban On Derogatory Words Of Nai Brahmins-TeluguStop.com

ఎవ‌రైనా ఈ ప‌దాల‌ను వాడితే భార‌త శిక్షాస్మృతి 1860 కింద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు.ఈ మేర‌కు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జి.జ‌య‌ల‌క్ష్మి జీవో జారీ చేశారు.

ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది.

మ‌రోవైపు కులం పేరుతో దూష‌ణ‌ను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల ఇవ్వటంపై నాయి బ్రాహ్మణుల సంఘం హర్షం వ్యక్తం చేశారు.ఈక్ర‌మంలో జీవో ఎంఎస్ 50ను రాష్ట్రమంతట ప్రచారం చేసి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం అని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube