హాట్‌టాపిక్‌ : ‘బాహుబలి’ లీక్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమాలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తుండగా, అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు లీక్‌ల బాధ ఉండవద్దనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మరీ ఈ సినిమాను చిత్రీకరించడం చేశాడు.అయితే ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కూడా ఈ సినిమాకు చెందిన దాదాపు 12 నిమిషాల ఫుటేజ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీం నుండి బయటకు వచ్చేసింది.

ఆ వీడియో కొన్ని గంటల పాటు యూట్యూబ్‌లో సందడి చేసింది.విషయం తెలిసిన చిత్ర యూనిట్‌ వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది.

యూట్యూబ్‌లో ఆ వీడియో లేకుండా చేయడంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ అయ్యారు.అయితే ఈ వీడియో ఇప్పటికే ఫేస్‌బుక్‌ మరియు ట్విట్టర్‌లో సందడి చేస్తోంది.

Advertisement

పలువురు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ లీక్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

ఇకపై ఎవరైనా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.లీక్‌కు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా ఉంది.ఇలాంటి చర్యలు జరగడం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అంటూ విశ్లేషకులు అంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు