టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు లీక్ల బాధ ఉండవద్దనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మరీ ఈ సినిమాను చిత్రీకరించడం చేశాడు.అయితే ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కూడా ఈ సినిమాకు చెందిన దాదాపు 12 నిమిషాల ఫుటేజ్ విజువల్ ఎఫెక్ట్స్ టీం నుండి బయటకు వచ్చేసింది.
ఆ వీడియో కొన్ని గంటల పాటు యూట్యూబ్లో సందడి చేసింది.విషయం తెలిసిన చిత్ర యూనిట్ వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది.
యూట్యూబ్లో ఆ వీడియో లేకుండా చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు.అయితే ఈ వీడియో ఇప్పటికే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో సందడి చేస్తోంది.
పలువురు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు ఈ లీక్పై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ఇకపై ఎవరైనా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.లీక్కు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు.
ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా ఉంది.ఇలాంటి చర్యలు జరగడం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అంటూ విశ్లేషకులు అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy