ఐపీఎల్ ప్రారంభం కాకముందే CSKకి బ్యాక్ టు బ్యాక్ షాకులు..!!

మార్చి 31 వ తారీకు నుండి ఐపీఎల్ ( IPL ) టోర్నీ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే.దాదాపు 74 మ్యాచ్ లు జరగనున్నాయి.

టైటిల్ కోసం పది టీమ్స్ తలబడనున్నాయి.ఈ క్రమంలో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) సత్తా చాటాలని మంచి ఊపు మీద ఉంది.

ఎందుకంటే మహేంద్రసింగ్ ధోనీకి ఇది చివరి ఐపీఎల్.దీని తర్వాత ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇటువంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఊహించని దెబ్బ తగిలింది.సీజన్ స్టార్ట్ అవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన కీలక ఆటగాడు ఆల్ రౌండర్ జేమీసన్( Jamieson ) టోర్నీకి దూరం కాగా.

Advertisement

తాజాగా పెసర్ ముఖేష్ చౌదరి కూడా దూరమైనట్లు తెలుస్తోంది.కారణం చూస్తే గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ముఖేష్ ( Mukesh ) పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో సీజన్ కు దూరం కానున్నట్లు సమాచారం.

పవర్ ప్లే లో కీలకంగా రాణించే ముఖేష్. గత ఏడాది 13 మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు తీయడం జరిగింది.మ్యాచ్ క్లిష్టమైన సమయంలో కీలకమైన వికెట్లు తీయటంలో ముఖేష్ తీరు చాలా డిఫరెంట్.

అటువంటిది వెన్నునొప్పి తగ్గకపోవడంతో ఈ సీజన్ కి దూరం కావడం జరిగిందట.టోర్నీ స్టార్ట్ అవ్వకముందే జేమీసన్.

ఇప్పుడు ముఖేష్ దూరం కావటం చెన్నైకి పెద్ద మైనస్ అని వార్తలు వస్తున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు