బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రజలందరికీ అందుబాటులో వైద్యం అందాలని ఈ ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయడం జరిగిందని, అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును ప్రజలందరూ తీసుకోగలరని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య, మల్లారపు మహేష్, గడ్డం రవి,గుర్రాల రాజిరెడ్డి,పవుడాల పూర్ణచందర్,బిఆర్ఎస్ నాయకులు కోల నరసయ్య, తోట రాజేందర్,కార్యదర్శి ఆరేందర్ రెడ్డి,పాలకవర్గ సభ్యులు ప్రజలు అందరూ పాల్గొన్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Latest Rajanna Sircilla News