జీవితంలో మనం ఏ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా స్థిరపడాలి అనే విషయాలను ముందుగా ప్రణాళికా బద్ధంగా నిర్ణయించుకుంటాం.ఆ దిశగానే అడుగులు వేస్తాం.
ఇలాంటి ఆలోచనలతోనే ఏపీ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుర్రాడు జీవితంలో భాగా స్థిరపడాలని మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించాలని ఉన్నత చదువుల కోసం ఊరు కాని ఊరు వదిలి దేశం కాని దేశం ఆస్ట్రేలియా వెళ్ళాడు.బుద్దిగా చదువుకుంటున్న సమయంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది.
అదే ఇప్పుడు అతడిని కోటీశ్వరుడుని చేసింది.
అతడి పేరు కొండా సంజిత్.
ఏపీ లోని నెల్లూరు కుర్రాడు, వయసు పెద్దగా ఏమి లేదు జస్ట్ 22 నే అందరిలా ఆలోచిస్తే ఎలా అనుకున్నాడో ఏమో కాని ఆస్టేలియాలో చదువుకు పులిస్టాప్ పెట్టి వ్యాపారం చేయాలని అనుకున్నాడు.చదువుకోవడానికి వెళ్లి వ్యాపారం చేయడం సరైనదేనా అని స్నేహితులు , హితులు చెప్పినా తనకు తనమీద ఉన్న నమ్మకంతో అవేమి చెవికెక్కించుకోలేదు.
అదే అతడి లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది.తల్లి తండ్రులకు వ్యాపారం చేస్తున్నానని చెప్పగానే షాక్ అయ్యారు…కానీ చివరికి కొడుపై భారం ఉంచి సరేనన్నారు.

తనతో సన్నిహితంగా ఉండే ఎన్నారై తో తన ఆలోచన పంచుకున్నాడు.దాంతో మెల్బోర్న్ నగరంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ఎలిజిబెత్ స్ట్రీట్ లో డ్రాప్ అవుట్ చాయ్ వాలా పేరుతో టీ స్టాల్ ప్రారంభించాడు.సంజిత్ తన టీ స్టాల్ ను ప్రారంభించి డిసెంబర్ నాటికి ఏడాది కావస్తోంది.ప్రస్తుతం అతడి టీ స్టాల్ టర్నోవర్ రూ.5 కోట్లు పై మాటేనట.సంజిత్ స్టాల్ లోకి వచ్చే వారిలో అత్యధికంగా ఆస్ట్రేలియన్స్ ఉంటున్నారట.
అంతేకాదు మనోడు చాయ్, పకోడీ కోసం ఎదురు చూస్తుంటారట.అదిరిపోయింది కదా నెల్లూరి కుర్రాడి ఆలోచన.