కృష్ణా జిల్లా గన్నవరం( Gannavaram ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi )కి అరెస్ట్ వారెంట్ జారీ అయింది.ఈ మేరకు వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్ జారీ చేసింది.

గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వల్లభనేని వంశీ గైర్హాజరు అయింది.దీంతో గత విచారణలో న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.తాజాగా ఇవాళ్టి విచారణకు కూడా వల్లభనేని వంశీ గైర్హాజరు కావడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ( Arrest warrant )జారీ చేసింది.
ఈ వారెంట్ ను అమలు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.







